Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోం

పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోం

- Advertisement -

”మూసీ” సుందరీకరణ కాదు…రియల్‌ ఎస్టేట్‌ దోపిడీ
బాధితులకు అన్ని రకాల అండగా ఉంటాం : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్‌ రావు హెచ్చరించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌ రెడ్డి, మాధవరం కష్ణారావు, రాజేంద్రనగర్‌ బీఆర్‌ఎస్‌ ఇన్‌ఛార్జి కార్తీక్‌ రెడ్డి తదితరులతో కలిసి మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌ వల్ల ఇండ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలను ఆయన ఆదివారం పరామర్శించారు. కేసీఆర్‌ హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ ఎలా పెంచాలి, ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచిస్తే… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జేసీబీలతో ఇండ్లు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేకుండా పూటకో విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

”మూసీని శుద్ధి చేయాలని అందరూ కోరుకుంటారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అప్పట్లోనే రూ.3800 కోట్లతో ఎస్టీపీలను నిర్మించి ఆ పని ప్రారంభించింది. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలోకి వదిలేందుకు డీపీఆర్‌లను కూడా తయారు చేశాం. అప్పుడు మా ప్రభుత్వానికి ఏ ఒక్క ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కార్‌ తలపెట్టిన ప్రాజెక్ట్‌కు డీపీఆర్‌ లేదు, ఎఫ్‌టీఎల్‌ తేలలేదు, ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్‌ రాలేదు. సోషల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ జరగలేదు. అలాంటప్పుడు ఏ చట్టం ప్రకారం ఇండ్లు ఖాళీ చేయమని నోటీసులు ఇస్తున్నారు? పేదల ఇండ్లు కూల్చి.. ఓ కార్పొరేట్‌ కంపెనీకి భూములు కట్టబెట్టే కుట్ర కోణం దాగుంది” అని హరీశ్‌రావు ఆరోపించారు.

ఫార్మాసిటీ కోసం తాము 14,000 ఎకరాల భూమి సేకరిస్తే.. దానికి ఫోర్త్‌ సిటీ అని పేరు మార్చి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ”బాపు ఘాట్‌ వద్ద అహింసా మూర్తి గాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలి తప్ప.. ఆ విగ్రహ నిర్మాణం పేరిట ప్రజల ఇండ్లు కూల్చుతూ, హింసాత్మక మార్గంలో భయాందోళనలకు గురిచేయడం దుర్మార్గం. ఎస్టీపీలు కట్టు, మురుగునీరు రాకుండా చెరు, కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరం పైపులైన్లతో గోదావరి నీళ్లతో మూసీని శుద్ధి చెయ్. మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని ప్రజా క్షేత్రంలో అడ్డుకుంటాం” అని హరీశ్‌రావు హెచ్చరించారు. మీరెవరూ ఆందోళన చెందకండి, భయ పడకండి. రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో నిలదీయడంతో పాటు చట్టపరంగా పోరాటం చేస్తామని బాధితులకు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -