- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నేపాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాడింగ్ జిల్లాలో ఓ బస్సు నదిలో పడిపోవడంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



