- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్ర మేజర్ గ్రామపంచాయతీ గ్రామసభ ఈనెల 26న గురువారం ఉదయం 10:30 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించడం జరుగుతుందని గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ బుధవారం ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. ఈ గ్రామ సభకు హాజరు కావడానికి గ్రామ ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, పత్రిక మిత్రులకు ఆహ్వానించడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రామ సభ విజయవంతానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ప్రజా సమస్యలు గ్రామ సభ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
- Advertisement -

