- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: భారత ఆర్మీ స్టాఫ్ చీఫ్గా జనరల్ ధీరజ్ సేథ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇండియాకు 31వ ఆర్మీ చీఫ్. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగిన జనరల్ ఉపేంద్ర ద్వివేది రిటైర్ కావడంతో ఆయన స్థానంలో ధీరజ్ సేథ్ నియామకయ్యారు. మహారాష్ట్ర, పూనేలోని ఖడక్వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన జనరల్ ధీరజ్ సేథ్ 1986 డిసెంబర్లో భారత ఆర్మీలో చేరారు. ఇంతకుందు ఆయన ఆర్మీ స్టాఫ్కు వైస్ చీఫ్గా పని చేశారు. దాదాపు 40 ఏళ్లుగా ఆర్మీలో వివిధ హోదాల్లో సేవలందిస్తూ, అనేక ఆపరేషన్స్లో పాల్గొన్నారు.
- Advertisement -



