- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
రేపటి నుంచి గ్రామపంచాయతీ వార్డు మెంబర్లకు శిక్షణా తరగుతులు ఉంటాయని ఆదివారం మద్నూర్ మండల అభివృద్ధి అధికారి రాణి, మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 21 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొదటి బ్యాచ్ 10 గ్రామ పంచాయతీ వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. ఇక రెండో బ్యాచ్ మిగిలిన 11 గ్రామపంచాయతీలలో గల 100 మంది వార్డు సభ్యులకు ఈనెల 2 నుండి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని వారు వెల్లడించారు.
- Advertisement -



