నవతెలంగాణ – హైదరాబాద్: ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ పై ఈ రోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు మితిమీరిన వేగంతో కారును నడుపుతూ, అదుపుతప్పి ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ను ఢీకొట్టారు. ఈ ధాటికి కారు ఫ్లైఓవర్ డివైడర్ను తాకడంతో నిప్పురవ్వలు చెలరేగి కారు మొత్తం మంటల్లో చిక్కుకుంది.
ప్రమాద తీవ్రతకు కారు ఇంజిన్ భాగంలో మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేలోపే కారు పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తూ కారులోని యువకులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ తీవ్ర గాయాలపాలయ్యారు. మద్యం మత్తులో కారును మితిమీరిన వేగంతో నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్బీనగర్ ఫ్లైఓవర్పై కారు బీభత్సం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



