- Advertisement -
నవతెలంగాణ- కాటారం
కాటారం మండలం పరిధిలోని వీరాపూర్ చెరువు, గారేపల్లి పైప్లైన్ భూసేకరణ (LA) స్థలాన్ని గురువారం సబ్ కలెక్టర్ సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా భూసేకరణకు సంబంధించిన సమస్యలు, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు, పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ పరిశీలనలో సాగునీటి శాఖ DEE, AEE, రెవెన్యూ అధికారులు, MEIL సిబ్బంది, గిర్దావర్, సర్వేయర్, గ్రామ ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -



