- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్యెల్యే విజయుడు సొంత పార్టీ నేతల కార్యక్రమానికి డుమ్మా కొట్టి, అధికార పార్టీ మంత్రుల పర్యటనలో కనిపించడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక నీటి దోపిడీని ఎండగట్టేందుకు బీఆర్ఎస్ నేతలు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ పర్యటన చేపట్టి, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుండగా… గద్వాల నియోజకవర్గంలో చేపట్టిన మంత్రుల ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొనడం చర్చనీయాంశమైంది. దీంతో ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారాలు మళ్లీ మొదలయ్యాయి.
- Advertisement -


