- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పోక్సో కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీనితో గత 42 రోజులకు పైగా జైలులోనే ఉన్న ఆయన, ప్రక్రియలన్నీ పూర్తి కావడంతో చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల (ష్యూరిటీలు) హామీతో భగీరథ్కు ఈ బెయిల్ లభించింది. జైలు నుండి ఆయనను వారి తరఫు న్యాయవాది తీసుకెళ్లారు.
- Advertisement -



