Thursday, July 30, 2026
E-PAPER
Homeఆటలుఇంగ్లండ్ టెస్టు సారథిగా మళ్లీ జో రూట్..

ఇంగ్లండ్ టెస్టు సారథిగా మళ్లీ జో రూట్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లండ్ టెస్టు క్రికెట్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ జో రూట్ రెండోసారి టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యాడు. అదే సమయంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకరైన స్టీఫెన్ ఫ్లెమింగ్‌ను టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎంపిక చేసింది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడం, టెస్టు హెడ్ కోచ్ పదవి నుంచి బ్రెండన్ మెకల్లమ్‌ను తొలగించడంతో ఈ కీలక నియామకాలు జరిగాయి. గతంలో 2017 నుంచి 2022 వరకు రూట్ 64 టెస్టుల్లో ఇంగ్లండ్‌కు సారథ్యం వహించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోనూ తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును నడిపించాడు. టెస్టు క్రికెట్‌లో 14,000 పరుగులకు పైగా సాధించి, సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ సందర్భంగా రూట్ మాట్లాడుతూ.. “మళ్లీ ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఎంపికవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇది కష్టమైన బాధ్యత అయినా, ఎంతో సంతృప్తినిస్తుంది. తర్వాతి తరం ఆటగాళ్లను ముందుకు నడిపించడానికి ఉత్సాహంగా ఉన్నాను” అని తెలిపాడు. ఫ్లెమింగ్‌ను ఆటపై అపారమైన పరిజ్ఞానం ఉన్న అద్భుతమైన నాయకుడిగా అభివర్ణించాడు. ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. “ప్రస్తుత విజయాలతో పాటు జట్టుకు మధ్యకాలిక, దీర్ఘకాలిక భవిష్యత్తును అందించడమే లక్ష్యం. కెప్టెన్‌ జో రూట్‌తో క‌లిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. అతను తరానికి ఒక్కడొచ్చే ప్రతిభావంతుడు” అని పేర్కొన్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -