Monday, July 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబంగ్లాదేశ్ లో ఎడతెరిపి లేని వర్షాలు.. 51 మంది మృతి

బంగ్లాదేశ్ లో ఎడతెరిపి లేని వర్షాలు.. 51 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : బంగ్లాదేశ్‌లో రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో కనీసం 51 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కాక్స్ బజార్, చిట్టగాంగ్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక గ్రామాలు నీటమునిగిపోగా, రహదారి, విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -