అమ్రాబాద్ మండలం మొల్క మామిడి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమ్మడి సంపత్ కుమార్ నిన్న రాత్రి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. విషయం తెలుసుకున్న సి బిఎం ట్రస్ట్ చైర్ పర్సన్, అమ్రాబాద్ జడ్పిటిసి సభ్యురాలు డాక్టర్ అనురాధ శుక్రవారం వారి స్వగృహానికి వచ్చి మృత దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట అమ్రాబాద్ ఎంపీపీ శ్రీనివాసులు ఉన్నారు.