- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులపై శనివారం గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి, గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్, ఉప సర్పంచ్ రమేష్ ఉపాధి హామీ అధికారుల ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ గ్రామ సభ జరిగింది. ఈ గ్రామసభలో పంచాయతీ పరిధిలో చేపట్టిన ఉపాధి హామీ పనులను ప్రజలకు తెలియజేశారు. కొన్ని పనులపై గ్రామస్తులు తనిఖీ అధికారులకు ప్రశ్నించారు వాటికి ఆయన సమాధానం ఇచ్చారు. ఈ గ్రామ సభలో గ్రామపంచాయతీ వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -


