- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన మల్లికార్జున్ పటేల్ ఇద్దరు కొడుకులు, కోడలు చార్టర్ అకౌంటెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మల్లిఖార్జున్ ఆదివారం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పెద్ద కుమారుడు రమేష్ భార్య ప్రియా కూడా చార్టర్ అకౌంటెంట్ పనిచేస్తున్నారు. దీంతో ఆ గ్రామస్థులు కూడా వారిని అభినందిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఒకే రకమైన వృత్తిని ముగ్గురు ఎంచుకోవడం, వృత్తిపరంగా చార్టర్ అకౌంటెంట్స్ గా స్థిరపడడం మండలానికి గర్వకారణమని పలువరు వారం అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
- Advertisement -



