- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సులోచన అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. సులోచన మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సెప్టెంబర్ 9 2019 నుంచి 8 మార్చి 2021 వరకు వీధుల్లో కొనసాగారు. ఆమె సొంత గ్రామం మద్నూర్ మండలంలోని కొడిచరలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం తెలిపారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, వివిధ పార్టీల ముఖ్య నాయకులు హాజరయ్యారు. అనంతరం ఆమె పార్థీవదేహానికి ఘన నివాళులు అర్పించారు. అదేవిధంగా ఆమె కుమారుడు సంగమేశ్వర్ ను ఓదార్చారు.
- Advertisement -



