- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు వెయిట్ లిఫ్టింగ్లో మరో పతకం దక్కింది. మహిళల 69కిలోల విభాగంలో హర్జీందర్ కౌర్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. ఆమె స్నాచ్లో 101 కిలోలు, క్లీన్ అండ్ జర్క్లో 126 కిలోలు ఎత్తి మొత్తం 227 కిలోల బరువును ఎత్తారు. దీంతో భారత్కు వెయిట్ లిఫ్టింగ్లో మొత్తం 7 పతకాలు, పారా పవర్ లిఫ్టింగ్లో ఒక పతకం లభించాయి. వీటిలో ఒక స్వర్ణం, ఐదు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి.
- Advertisement -



