- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. ఫ్రాన్స్లో 420 చదరపు కిలోమీటర్లకుపైగా, స్పెయిన్లో 1,25,000 ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది. గిరాండ్ ప్రాంతంలో కోట్ల విలువచేసే 240కి పైగా విలాసవంతమైన ఇళ్లు కాలి బూడిదయ్యాయి. యూరోపియన్ యూనియన్ అధికారులు నవంబర్ మొదటి వారం వరకు కార్చిచ్చు కొనసాగవచ్చని హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్లలో ప్రమాదం పెరిగే అవకాశం ఉంది.
- Advertisement -



