ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్టార్ హీరోలతో గ్రాండ్ ఎంటర్టైనర్స్ చేస్తూనే, మరోవైపు కొత్త టాలెంట్తో కంటెంట్ బేస్డ్ సినిమాలను నిర్మిస్తోంది. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ను ప్రకటించింది. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమాకి ‘దొంగ నా కొడుకు’ అనే క్రేజీ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ టైటిల్ వినగానే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వినూత్నంగా డిజైన్ చేసిన లోగో సినిమా ఫన్, ఎంటర్టైనింగ్ టోన్ను పరిచయం చేస్తోంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో భారీ జాక్ ప్లేయింగ్ కార్డ్ నుంచి చిరునవ్వుతో స్టైలిష్గా ఎంట్రీ ఇస్తున్న మౌళి లుక్ ఆకట్టుకుంటోంది. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే… సరదా మనస్తత్వం ఉన్న యువకుడు వరుసగా జరిగే దొంగతనాల నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ సంఘ టనల్లో చిక్కుకోబోతున్నాడనే ఆసక్తిని కలిగిస్తోంది. ప్లేయింగ్ కార్డ్ కాన్సెప్ట్ సినిమాకు యూనిక్ విజువల్ ఐడెంటిటీని తీసుకొచ్చింది. పోస్టర్లో కనిపించే బ్లాక్ బ్యాక్ప్యాక్, చెల్లాచెదురుగా పడిన బంగారు నగలు, గాలిలో ఎగురుతున్న కాగితాల ముక్కలు వంటి విజువల్ ఎలిమెంట్స్ కథలోని దొంగ తనం కాన్సెప్ట్ను ఆసక్తికరంగా సూచిస్తున్నాయి. ఈ క్రియేటివ్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. వినగానే గుర్తుండిపోయే టైటిల్, క్రియేటివ్ ఫస్ట్ లుక్ పోస్టర్తో ‘దొంగ నా కొడుకు’ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. సినిమా గురించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మిత శెట్టి, అలీ, రజిత, రఘుబాబు, ప్రియ, గుండు సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి రచన, దర్శకత్వం: శ్రీను కంబాల, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, సహ నిర్మాత: అనిల్ యెర్నేని, డీవోపీ: సూర్య బాలాజీ, సంగీతం: సింజిత్ యర్రమిల్లి, ఎడిటర్: శ్రీధర్ సోంపల్లి,
కాస్ట్యూమ్ డిజైనర్: మహి డేరంగుల, ఆర్ట్ డైరెక్టర్: నాగేంద్ర గువ్వల, సీఈవో – చెర్రీ.
మామూలు దొంగ కాదు..
- Advertisement -
- Advertisement -



