- Advertisement -
రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో ఆడేందుకు భారత జట్టు శ్రీలంకకు చేరుకుంది. మంగళవారం కొలంబోలో కాలుమోపిన శుభ్మన్ గిల్సేన ఈ నెల 7 నుంచి కొలంబోలోని ఎసీసీ గ్రౌండ్లో శ్రీలంక ఎలెవన్తో మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడనుంది. భారత్, శ్రీలంక తొలి టెస్టు గాలెలో 15 నుంచి ఆరంభం కానుంది. బ్యాటర్ సాయి సుదర్శన్ టెస్టు సిరీస్కు ఎంపికైనా మంగళవారం జట్టుతో పాటు శ్రీలంక బయల్దేరలేదు. ప్రస్తుతం సాయి సుదర్శన్ బెంగళూరులోని సీఓఈలో ఉన్నాడు. దీంతో సిరీస్లో అతడు ఆడేది లేనిది అనుమానంగా మారింది.
- Advertisement -



