Wednesday, March 25, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబంకుల వద్ద బారులు తీరిన వాహనాలు..

బంకుల వద్ద బారులు తీరిన వాహనాలు..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్‌లో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కోసం జనం బారులు తీరారు. యుద్ధం కారణంగా ఇంధన కొరత ఏర్పడిందనే వదంతులు వేగంగా వ్యాపించడంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. దీంతో తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకునేందుకు పెట్రోల్ బంకులకు పోటెత్తారు. ఫలితంగా నగరంలోని దాదాపు అన్ని బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడ్డాయి. కూకట్‌పల్లి, అమీర్‌పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, సనత్‌నగర్‌, ఎర్రగడ్డ, అబిడ్స్ సహా పలు ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. గంటల తరబడి వాహనదారులు క్యూలలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో కొన్ని బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడంతో ప్రజల ఆందోళన మరింత పెరిగింది. ఈ పరిణామంపై అధికారులు స్పందించారు. పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరానికి అవసరమైనంత ఇంధనం నిల్వలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -