Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సలాబత్పూర్ ఆంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.2.12 లక్షలు

సలాబత్పూర్ ఆంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.2.12 లక్షలు

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్

మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.2,12,965 వచ్చినట్లు ఆలయ అధికారి వేణు బుధవారం విలేకరులకు తెలియజేశారు. ఈ హుండీ లెక్కింపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాల మేరకు హుండీ తెరిచినట్లు అధికారి తెలిపారు.

ఈ లెక్కింపులో జిల్లా శాఖ అధికారులు ఆలయ అధికారులు మద్నూర్ మండలంలోని వివిధ ఆలయాలకు చెందిన ధూప దీప నైవేద్య అర్చకులు డబ్బులను లెక్కించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఆలయ కమిటీ సభ్యులు ధూప దీప నైవేద్య అర్చకుల సంఘం జిల్లా అధ్యక్షులు అంజన్ అప్ప, భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -