- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారి త్యాగాలను గుర్తుచేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా తల్లుల ఆవేదనను చూసి కదిలిపోయానని, ఒక తల్లిగా అలాంటి సందర్భాలలో కన్నీళ్లు ఆగవని ఆమె తెలిపారు. మహిళల దుస్తుల ఎంపికపై సమాజంలో ఉన్న అభిప్రాయాలపై ఆమె స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. దుస్తుల ఎంపిక అనేది పూర్తిగా వ్యక్తిగత సౌకర్యం, స్వేచ్ఛకు సంబంధించిన విషయమని, ప్రజలు ఒకరి పనితీరును అంచనా వేయాలి తప్ప, వారు ధరించే వస్త్రధారణను కాదని నొక్కిచెప్పారు.
- Advertisement -



