- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టుమిషన్లు’ పథకం ప్రారంభించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 119 నియోజకవర్గాల్లో తొలి విడతగా 1.19లక్షల ఆటోమేటిక్ కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు. ఇందుకోసం ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. పేద, ఒంటరి మహిళలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు.
- Advertisement -



