- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం కొయ్యుర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు రంగుల మువ్వెన్నల జెండాను గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ బుక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, వార్డు సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



