నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో మధ్యంతర ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలకు సంబంధించిన కేసులో ప్రస్తుతం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని అలహాబాద్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు CBI, ED ఎలాంటి నివేదికను సమర్పించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణ జరిగే వరకు అలహాబాద్ హైకోర్టు తన తదుపరి విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు CBI, ED ఎలాంటి నివేదికను సమర్పించకూడదని కూడా పేర్కొంది. ఈ కేసులో కర్ణాటకకు చెందిన ఎస్. విఘ్నేశ్ శిశిర్, అలాగే CBI, EDలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



