గ్రామాభివృద్ధికి కృషి: సర్పంచ్ రామ్ గోపాల్ రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలో పలు విధుల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్ వీధి దీపాలను సోమవారం సాయంత్రం గ్రామ సర్పంచ్ రామ్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, మూడా నిధులతో ఈ దీపాలను ఏర్పాటు చేయించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని సర్పంచ్ తెలిపారు. అలాగే గత గత 40 సంవత్సరాలుగా బోయివాడ ను మరచిపోయిన గత ప్రజా ప్రతినిధులు , నేడు ఆ వాడను అభివృద్ధి దిశలో తీసుకొస్తున్న అన్నారు. వాడలో 20 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు వేయడం జరిగిందన్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నెమ్లిలో హైమాస్ లైట్లు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



