Monday, April 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు: సర్పంచ్

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ- మద్నూర్
ప్రజా పాలన ప్రభుత్వ హాయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కృషి ఫలితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతున్నాయని డోంగ్లి మండలంలోని మోగా గ్రామ సర్పంచ్ హాలే బస్వంత్ అన్నారు. ఆదివారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు పాలనలో ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వ హాయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు కృషి ఫలితంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, గ్రామ పెద్దలు పంచాయితీ పాలకవర్గం సభ్యులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -