లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులతో ఉద్రిక్తత
హార్ముజ్ మూసివేత
కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ.. లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. ఈ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దీనికి సంబంధించిన కీలక విషయం వెలుగులోకి వచ్చింది. జలసంధిని పూర్తిగా మూసేయడంతో దీని మీదుగా వెళ్లాల్సిన నౌకలు బలవంతంగా వెనక్కి మరలుతున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.మారిటైమ్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. గ్రీక్కు చెందిన బల్క్ క్యారియర్, లైబీరియా జెండా కలిగిన రెండు నౌకలు హార్ముజ్ను దాటాయి. కాల్పుల విరమణ తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు కొనసాగి స్తుండటంతో.. ఇరాన్ హార్ముజ్ను పూర్తిగా మూసివేసింది. దీంతో ముసందమ్ తీరం సమీపంలో ఈ నౌక బలవంతంగా వెనుదిరగాల్సి వచ్చింది. అంతర్జాతీయ రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. దీంతోపాటు మరికొన్ని నౌకలు కూడా ఇలానే వెనుదిరిగినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక, మంగళవారం నాటికి సరకుతో నిండిన 187 ట్యాంకర్లు సహా వెయ్యికి పైగా నౌకలు హార్ముజ్ జలసంధి సమీపంలోనే ఉన్నాయని క్లెప్లర్ పేర్కొంది. పరిస్థితులు చక్కబడి సాధారణ రాకపోకలు ప్రారంభమైనా.. ఈ నౌకలు జలసంధిని దాటేందుకు రెండు వారాలకు పైనే పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హార్ముజ్ నుంచి వెనుదిరుగుతున్న నౌకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



