దోహ : దేశంలో ఎల్పీజీ సంక్షోభం నెలకొన్న సమయంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఖతార్లో పర్యటి స్తుండటం ప్రాధాన్యతను సంతరిం చుకుంది. గురు, శుక్రవారాల్లో కేంద్రమంత్రి ఖతార్లో పర్య టించారు. భారత్కు సహజ వాయు వును సరఫరా చేసే ముఖ్యమైన ఖతార్ ఒకటి. అయితే తాజా మధ్యఆసియా సంక్షోభంలో భాగం గా ఖతార్లోని ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మార్చి ప్రారంభం నుంచి ఎల్పిజి ఉత్పతిని ఖతార్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో హర్దీప్ సింగ్ పురి పర్యటిస్తున్నారు. కాగా, ఈ వారం ప్రారంభంలో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రితో కూడా హర్దీప్ సింగ్ పురి సమావేశమైన సంగతి తెలిసిందే. దేశీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే బంగ్లాదేశ్కు ఇంధన ఉత్పత్తులను సరఫరా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నిజా నికి 2007 నుంచి కూడా వివిధ మాధ్యమాల ద్వారా బంగ్లాదేశ్కు ఇంధన ఉత్పత్తులను భారత్ సరఫరా చేస్తోందని తెలిపారు.
ఖతార్ పర్యటనలో పెట్రోలియం శాఖ మంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



