- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మెరుపు వరదలు నేపాల్ ను హడలెత్తించాయి. భోటేకోశి, త్రిశూలి నదుల వెంబడి ఉన్న నివాస ప్రాంతాలపై రాకాసి వరదలు ముంచెత్తాయి. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెప్పపాటులో బురదతో కూడిన వరద నీరు నదీ తీరాలను దాటి పొంగిపొర్లుతూ, భవనాలను దాటుకుంటూ, వంతెనలు, రోడ్లు, వాహనాలను దెబ్బతీస్తూ చిక్కటి బురద కింద పూడ్చివేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. తరుముకొస్తున్న వరద నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి పలువురు ప్రజలు పరుగులు తీశారు.
- Advertisement -



