Sunday, August 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్ వరదలు..788 మృతదేహాలు వెలికితీత

నేపాల్ వరదలు..788 మృతదేహాలు వెలికితీత

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: భారీ ఆకస్మిక వరదల అనంతరం 788 మృతదేహాలు వెలికితీసినట్లు ఆదివారం నేపాల్ పోలీసులు ప్రకటించారు. తాజా గణాంకాల ప్రకారం.. అత్యధిక మరణాలు చిత్వాన్‌లో (264) నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో నవల్‌పరాసి తూర్పు (194), నవల్‌పరాసి పశ్చిమ (120), గోర్ఖా (58), నువాకోట్ (52), ధాడింగ్ (50), తనహున్ (37), రసువా (13) ఉన్నాయి. అంతకుముందు, వివిధ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, మధ్యాహ్నం 1 గంట సమయానికి 2,502 మంది ఆచూకీ తెలియకుండా పోయారని నేపాల్‌లోని ‘నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ & మేనేజ్‌మెంట్ అథారిటీ’ (NDRRMA) ప్రకటించింది. సరైన వివరాలు తెలియని మృతదేహాలను ఆ దేశవ్యాప్తంగా ఉన్న 21 ఆసుపత్రులలో భద్రపరిచారు. గల్లంతైన వారిలో 933 మంది ప్రాంతీయ జలవిద్యుత్ ప్రాజెక్టుల కార్మికులు, 592 మంది విదేశీయులు, విదేశీ బృందాలతో ప్రయాణిస్తున్న 127 మంది నేపాలీ పౌరులు ఉన్నారని NDRRMA తెలిపింది. ముప్పు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -