- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన బాసర పుణ్యక్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ర రావు చౌహాన్ దంపతులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో కుంకుమార్చనతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయాధికారులు మాజీ సిఎం దంపతులను ఘనంగా సన్మానించి, అమ్మవారి ఫోటో ప్రసాదాన్ని ఆలయ అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్, బాసర మండల బిజేపి అధ్యక్షుడు పుట్నల సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



