– వధూవరులకు ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గంలో మంగళవారం పలు వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ మంత్రి జలగం ప్రసాద్ బాబు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు,భద్రాచలం ఐటీడీఏ పీవో బి. రాహుల్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
మండల కేంద్రంలోని వివాహ కార్యక్రమంలో శీమకుర్తి కైలాష్ నాథ్ – వనజ దంపతుల కుమారుడు సంజీవ్, కుసుమ ధనలక్ష్మి వివాహ వేడుకలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు వధూవరులకు అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మొద్దులమడ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు చిప్పల బాబురెడ్డి – దేవి దంపతుల కుమారుడు పండు రెడ్డి, మేఘమాల వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.



