- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మండలం ఎడ్లపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సోమవారం పాఠశాలలో కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ పూర్ణచందర్రావు,గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇంకా మంచి చదువులు చదివి,ఉన్నత స్థాయికి ఎదగాలని ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరారు. ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
- Advertisement -



