గర్భధారణ సమయం ప్రతి మహిళ జీవితంలో అత్యంత కీలకమైన, ఆనందకరమైన దశ. ఈ సమయంలో తల్లి తీసుకునే ఆహారం నేరుగా కడుపులోని బిడ్డ ఆరోగ్యం, ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే పండ్లను తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భిణీలు తమ డైట్లో తప్పక చేర్చుకోవాల్సిన పండ్లు, వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. నారింజ : గర్భిణీలకు ‘ఫోలేట్’ అత్యంత అవసరం. ఇది బిడ్డ మెదడు, వెన్నుముక ఎదుగుదలకు సహాయపడుతుంది. నారింజ, బత్తాయి వంటి పండ్లలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్-సి తల్లిలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల దరిచేరకుండా చూస్తుంది.
2. దానిమ్మ : చాలామంది గర్భిణీలు రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. దానిమ్మ పండు ఈ సమస్యకు చెక్ పెడుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తాన్ని వద్ధి చేస్తుంది. అంతేకాకుండా, ఇది ఎముకల దఢత్వానికి తోడ్పడే విటమిన్-కె ని కూడా అందిస్తుంది.
3. అరటి పండు : గర్భధారణ సమయంలో మలబద్ధకం ఒక సాధారణ సమస్య. అరటి పండులో ఉండే పీచు పదార్థం ఈ సమస్యను నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే పొటాషియం.. గర్భిణీలలో వచ్చే కాళ్ల వాపులు, తిమ్మిర్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం పూట ఉండే వికారాన్ని తగ్గించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
4. యాపిల్ : యాపిల్లో విటమిన్ ఏ, సి, పొటాషియం ఉంటాయి. గర్భధారణ సమయంలో యాపిల్ తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు భవిష్యత్తులో ఆస్తమా, అలర్జీలు వచ్చే అవకాశం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
5. జామ : నారింజ కంటే ఎక్కువ విటమిన్-సి జామలో ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచడానికి జామకాయ దోహదపడుతుంది. అయితే బాగా పండినవి కాకుండా, దోరగా ఉన్నవి తినడం మంచిది.
6. అవకాడో : ఇటీవల కాలంలో మన దగ్గర కూడా ఇవి విరివిగా లభిస్తున్నాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులుబిడ్డ మెదడు అభివద్ధికి చాలా మంచివి.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి : పండ్లను తినే ముందు వాటిని ఉప్పు నీటిలో లేదా మంచి నీటిలో శుభ్రంగా కడగాలి. పురుగు మందుల అవశేషాలు లేకుండా చూసుకోవాలి.
గర్భిణీలు ఇవి తప్పక తినాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



