- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పదేండ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ సభకు వచ్చి వారి అనుభవాన్ని పంచుకోవాలని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మహాధర్నా చేపట్టాయి. మంత్రి శ్రీధర్బాబు ఈ ధర్నాలో పాల్గొని మాట్లాడారు. ‘బీఆర్ఎస్ నేతలతో రోడ్లపై మాట్లాడించటం కాదు.. సభకు వస్తే సమాధానం చెప్తాం. బీఆర్ఎస్ నాయకుడి వైఖరి మారకుంటే.. మరో పదేళ్లు కూడా వాళ్లు రోడ్లపైనే ఉంటారు’’అని అన్నారు.
- Advertisement -



