- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: మెదక్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగులతో అప్పులపాలై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ పట్టణానికి చెందిన దిలీప్ కుమార్ (29) స్థానికంగా పెయింటర్గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి దాదాపు రూ. 2లక్షలు నష్టపోయాడు. బెట్టింగ్ కోసం అప్పులు చేయడంతో.. వాటిని తీర్చేదారిలేక గోసముద్రం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
- Advertisement -