నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాకేశ్ మెహతా (74) నోయిడాలోని తన ఫ్లాట్లో మృతి చెందారు. ఆరోగ్య సమస్యలు, మానసిక ఆందోళనల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. గత ఐదేళ్లుగా ఆయన ఈ నోయిడా ఫ్లాట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆయన భార్య (రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి) డెహ్రాడూన్లో నివసిస్తుండగా, కుమార్తె లండన్లో నివసిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అపార్ట్మెంట్ సెక్యూరిటీ వెళ్లి చూడగా ఆయన ఉరివేసుకుని కనిపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
రాకేశ్ మెహతా 1975 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. మాజీ ముఖ్యమంత్రి దివంగత షీలా దీక్షిత్ హయాంలో ఆయన 2007 నుండి మూడేళ్లకు పైగా ఢిల్లీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఎంసీడీ (MCD) కమిషనర్గా పనిచేయడంతో పాటు, 2010లో ఢిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణలోను, ఢిల్లీ రవాణా, విద్యుత్ విప్లవాత్మక మార్పుల్లో ఆయన కీలక భూమిక పోషించారు.



