- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. బుధవారం లోక్భవన్కు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ను కలిసి రాష్ర్టంలో నెలకొన్న పరిస్థితును వివరించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చేందుకు హామీల వర్షం కురిపించి వంద రోజుల్లో అన్ని హామీలు అమలుచేస్తామని చెప్పి ఇప్పుడు 1000 రోజులైనా వాటిని పట్టించుకోవడం లేదు. శాసనసభ్యులపై నడిరోడ్డుపై ఎలా దాడి చేశారో గవర్నర్కు ఆధారాలు చూపించామన్నారు.
- Advertisement -



