- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిలిప్పిన్స్లోని పర్యటక ప్రాంతమైన పలవాన్ వెళుతున్న పడవ నిన్న(బుధవారం) రాత్రి సముద్రం మధ్యలో అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ఘటన జరిగిన సమయంలో పడవలో 137 మంది ఉన్నారు. వీరిలో 117 మంది ప్రయాణికులు కాగా.. 17 మంది సిబ్బంది. ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. మరో 87 మంది ఆచూకీ గల్లంతైంది. 42 మందిని కాపాడినట్లు తెలుస్తోంది.
- Advertisement -



