నవతెలంగాణ – హైదరాబాద్ : ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియాకు ఊరట లభించింది. స్టార్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి గాయాల నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి జట్టులోకి చేరారు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షల్లో వీరిద్దరూ ఉత్తీర్ణులయ్యారు. వీరు గురువారం ఢిల్లీలో జట్టుతో కలవనున్నారు. గత జులైలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా సుందర్ తొడ కండరాల గాయంతో జట్టుకు దూరమయ్యాడు.
ఇక జూన్లో స్వదేశంలో ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన వన్డే సిరీస్ అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి క్వాడ్రిసెప్స్ గాయానికి గురయ్యాడు. తాజాగా వీరిద్దరూ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో జట్టు యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఈనెల 13 నుంచి ఆఫ్ఘనిస్థాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇబ్రహీం జద్రాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ జట్టుతో భారత్ ఆడనున్న తొలి ద్వైపాక్షిక టీ20 సిరీస్ ఇదే. ఈ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ భారత జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.



