- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) (57) కన్నుమూశారు. విశాఖలో మంగళవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఏలూరు నుంచి మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009లో కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. 2017లో ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2019లో ఆ పార్టీ తరఫున గెలిచారు. జగన్ హయాంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2025లో ఆళ్ల నాని టీడీపీలో చేరారు.
- Advertisement -



