- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ద్రోణి, క్యూములోనింబస్ మేఘాల ప్రభావం నెలకొందని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, SRD, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది.
- Advertisement -



