- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు కాల్పుల విరమణను మరో మూడు వారాలపాటు పొడిగించేందుకు అంగీకరించాయి. ఇజ్రాయెల్ ,లెబనాన్ మధ్య దశాబ్దాలతర్వాత మొదటి ప్రత్యక్ష దౌత్య చర్చలు ఇవి. గురువారం వైట్ హౌస్లో జరిగిన చర్చల అనంతరం కాల్పుల విరమణను మరో మూడు వారాల పాటు పొడిగించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు అంగీకరించాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
- Advertisement -



