Saturday, June 7, 2025
E-PAPER
Homeజాతీయం4వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య

4వేలు దాటిన కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం… కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,026కు చేరింది. గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు. దీంతో ఈ ఏడాది కోవిడ్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 37కు చేరుకుందని అధికారులు తెలిపారు. కేరళలో 1,416, ఢిల్లీలో 393, పశ్చిమబెంగాల్‌లో 372, కర్ణాటకలో 311, మహారాష్ట్రలో 494, గుజరాత్‌లో 397 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 28, తెలంగాణలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతిరోజూ కోవిడ్‌ టెస్టుల సంఖ్య వెయ్యికి పెంచాలని సూచించింది. కోవిడ్‌ పేషెంట్ల కోసం ప్రత్యేకంగా వార్డుల్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -