Saturday, June 7, 2025
E-PAPER
Homeజాతీయంఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు అస్వస్థత

ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు అస్వస్థత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) బొత్స సత్యనారాయణ బుధవారం తీవ్ర‌ అస్వస్థతకు గురయ్యారు. వెన్నుపోటు దినం కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లిలో ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయ‌న వేదిక‌పై మాట్లాడుతూ ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయారు. దాంతో కార్య‌క‌ర్త‌లు వెంట‌నే ఆయ‌న్ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంద‌నే విష‌యం తెలియాల్సి ఉంది. అధిక ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా బొత్స అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు స‌మాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -