నవతెలంగాణ-హైదరాబాద్: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై జ్యూడిషియల్ విచారణ చేపడుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కర్నాటక హోంమంత్రి జి.పరమేశ్వర్ చెప్పారు. గురువారం బెంగళూర్లోని చిన్న స్టేడియాన్ని కర్నాటక హోంమంత్రి జి.పరమేశ్వర్ సందర్శించారు. స్టేడియం ప్రాంగణంలో పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం విక్టరీ పరేడ్ ను నిర్వహించాలని ఆర్సీబీ జట్టు యాజమాన్యాన్ని కానీ, కర్నాటక క్రికెట్ అసోసియేషన్ను తమ ప్రభుత్వం కోరలేదని, యాదృశ్చికంగా బెంగళూర్ వచ్చిన సందర్భంగా జట్టుతో పాటు సభ్యులను సన్మానించామని ఆయన స్పష్టం చేశారు. ఈ దుర్ఘటన తన మనస్సును కలిచివేసిందన్నారు. ఈ ఘటనపై మేజిస్ట్రేజ్ విచారణకు సీఎం సిద్దరామయ్య ఆదేశించారని ఆయన తెలిపారు. దీంతో విచారణ నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో తొక్కిసలాట జరిగి…11మంది చనిపోగా..50మంది గాయపడిన విషయం తెలిసిందే.
వాళ్లు వచ్చారనే సన్మానించాం..మేము రమ్మనలే: కర్నాటక హోంమంత్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES