- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్, ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి కూడా మాగంటి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారు హైదరాబాద్ మాదాపూర్లోని మాగంటి గోపీనాథ్ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించిన అనంతరం, తీవ్ర విషాదంలో ఉన్న గోపీనాథ్ కుటుంబ సభ్యులను లోకేశ్, బ్రాహ్మణి దంపతులు పరామర్శించారు. వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యం చెప్పారు.
- Advertisement -