- Advertisement -
న్యూఢిల్లీ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణకు ఆప్ నేత, మాజీ మంత్రి మనీశ్ సిసోడియా గైర్హాజ రయ్యారు. సిసోడియా సోమవారం విచారణకు హాజరుకాలేరని ఆయన న్యాయవాది తెలిపారని ఏసీబీ వర్గాలు తెలిపాయి. మరోరోజు విచారణ కోసం సమన్లు పంపనున్నట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. రూ.2,000 కోట్ల తరగతి గదుల కుంభకోణంలో జూన్ 6, 9 తేదీల్లో విచారణకు హాజరుకావాలంటూ ఆప్ నేతలు సత్యేందర్ జైన్, మనీశ్ సిసోడియాలకు ఏసీబీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 6 (శుక్రవారం) సత్యేందర్ జైన్ విచారణకు హాజరయ్యారు. ఐదుగంటలకు పైగా ఏసీబీ ప్రశ్నించింది.
- Advertisement -