నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్లో లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాదంపై ఆరా తీశారు. గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, పోలీసు కమిషనర్తో మాట్లాడారు.ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధితులకు కేంద్ర ప్రభుత్వ సహాయం ద్వారా పూర్తి అందిస్తామని అమిత్ షా.. సీఎంకు హామీ ఇచ్చారు.

గుజరాత్ అహ్మదాబాద్లో విమాన ప్రమాదం (plane crash) చోటు చేసుకుంది. 242 మంది ప్రయాణికులతో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం.. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే మేఘానిలో సివిల్ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అలాగే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
